Sachin Tendulkar:లెజెండ్స్‌ లీగ్‌లో సచిన్‌ ఆడట్లేదు

భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ త్వరలో జరిగే లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్లో ఆడట్లేదని.. అతడు ఆడుతున్నాడన్న వార్తల్లో వాస్తవం లేదని సచిన్‌కు సంబంధించి క్రికెట్‌ వ్యవహరాలు చూసే

Updated : 09 Jan 2022 07:11 IST

దిల్లీ: భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ త్వరలో జరిగే లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్లో ఆడట్లేదని.. అతడు ఆడుతున్నాడన్న వార్తల్లో వాస్తవం లేదని సచిన్‌కు సంబంధించి క్రికెట్‌ వ్యవహరాలు చూసే ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ శనివారం ప్రకటించింది. రిటైర్‌ అయిన దిగ్గజ ఆటగాళ్ల కోసం ఈనెల 20 నుంచి ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబచ్చన్‌ నటించిన ఈ లీగ్‌కు సంబంధించిన ప్రచార వీడియోలో సచిన్‌ తెందుల్కర్‌ కూడా కనిపించాడు. దీంతో తెందుల్కర్‌ కూడా ఈ లీగ్‌లో ఉన్నాడన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌టీ ఈ ప్రకటన చేసింది. ‘‘లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌లో సచిన్‌ ఆడుతున్నాడన్న వార్తల్లో నిజం లేదు. నిర్వాహకులు అమితాబ్‌ బచ్చన్‌తో పాటు అభిమానులను కూడా తప్పుదోవ పట్టించారు’’ అని ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. లెజెండ్‌ లీగ్‌లో ఆడుతున్న ఇండియా మహరాజాస్‌ జట్టులో యువరాజ్‌సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని