టైటాన్స్‌కు మరో ఓటమి

ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆ జట్టు సోమవారం 27-28 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది

Published : 18 Jan 2022 03:08 IST

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆ జట్టు సోమవారం 27-28 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. రజ్నీష్‌ (11) రైడింగ్‌లో మరోసారి మెరిసినా ఫలితం లేకుండా పోయింది. బెంగాల్‌ జట్టులో మణిందర్‌ (10) సత్తాచాటాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 50-40తో పుణెరి పల్టాన్‌పై గెలిచింది. యూపీ తరపున సురేందర్‌ (21) అదరగొట్టాడు. పర్దీప్‌ (10) కూడా రాణించాడు. పుణెరి జట్టులో అస్లామ్‌ (16), మోహిత్‌ (13) ఆకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని