ఆధిక్యంలో విదిత్‌

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరాతి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మూడు రౌండ్లు ముగిసేసరికి 2.5 పాయింట్లతో ముందంజలో

Published : 19 Jan 2022 04:26 IST

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌

విజ్క్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరాతి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మూడు రౌండ్లు ముగిసేసరికి 2.5 పాయింట్లతో ముందంజలో నిలిచాడు. మూడో రౌండ్లో డానిల్‌ దుబోవ్‌ (రష్యా)పై విదిత్‌ పైచేయి సాధించాడు. మరో పోరులో జోర్డెన్‌ ఫోరీస్ట్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే), జాన్‌ డుబా (పోలెండ్‌) మధ్య పోరు డ్రాగా ముగిసింది. కార్ల్‌సన్‌ మరో అయిదుగిరితో కలిసి 2 పాయింట్లతో ఉమ్మడిగా ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని