ప్రణయ్ శుభారంభం
సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-14,
సయ్యద్ మోదీ టోర్నీ
లఖ్నవూ: సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-14, 21-18తో డానిలో బోస్నిక్ (ఉక్రెయిన్)పై గెలిచి ప్రిక్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. సౌరభ్వర్మ 21-15, 19-21, 18-21తో రెస్కీ ద్విచేయో (అజర్బైజాన్) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆకర్షి కశ్యప్ 21-13, 21-14తో ముగ్ధపై, అనుపమ ఉపాధ్యాయ 21-7, 21-10తో రితుపర్ణ దాస్పై విజయం సాధించారు. ఐరాశర్మ 21-15, 16-21, 16-21తో లారెన్ లామ్ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్లో ఇషాన్ భట్నాగర్- సాయి ప్రతీక్ 21-18, 19-21, 21-17తో ఆరిఫ్- ముహ్మద్ (మలేసియా)పై, అర్జున్- ధ్రువ్ కపిల 23-21, 21-9తో టార్జుస్- వేగార్డ్ (నార్వే)పై నెగ్గి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.