టైటాన్స్ ఓటమి బాట
ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్లో తన గత మ్యాచ్లో గెలిచి ఎట్టకేలకు బోణీ చేసిన తెలుగు టైటాన్స్ మళ్లీ ఓటమి బాట పట్టింది. శనివారం ఆ జట్టు 35-42 తేడాతో యు ముంబా చేతిలో పరాజయం పాలైంది. టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్లో తన గత మ్యాచ్లో గెలిచి ఎట్టకేలకు బోణీ చేసిన తెలుగు టైటాన్స్ మళ్లీ ఓటమి బాట పట్టింది. శనివారం ఆ జట్టు 35-42 తేడాతో యు ముంబా చేతిలో పరాజయం పాలైంది. టైటాన్స్ తరపున ఆదర్శ్ (12) రైడింగ్లో పోరాడాడు. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో ఓటమి తప్పలేదు. ముంబా జట్టులో అభిషేక్ (15) సత్తాచాటాడు. కెప్టెన్ ఫజల్ (6) ట్యాక్లింగ్లో రాణించాడు. అంతకుముందు తొలి మ్యాచ్లో పుణెరి పల్టాన్ 37-35తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. పుణెరి జట్టులో మోహిత్ (13) ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బెంగళూరు తరపున పవన్ (10) ఆకట్టుకున్నాడు. మరోవైపు జైపుర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్ 34-34తో టై అయింది. జైపుర్ తరపున అర్జున్ (15), తలైవాస్ జట్టులో అజింక్య పవార్ (15), మంజీత్ (12) మెరిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత