ఉత్కంఠ పోరులో హరియాణా గెలుపు

ప్రొ కబడ్డీ-8లో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 36-35తో యూపీ యోధాను ఓడించింది. హరియాణా విరామ సమయానికి 15-14తో  ఆధిక్యంలో నిలిచింది.

Published : 24 Jan 2022 04:27 IST

బెంగళూరు: ప్రొ కబడ్డీ-8లో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 36-35తో యూపీ యోధాను ఓడించింది. హరియాణా విరామ సమయానికి 15-14తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డప్పటికీ చివరికి హరియాణాకే మ్యాచ్‌ సొంతమైంది. మరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 31-36తో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓటమి పాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని