రోహిత్‌ రెడీ..

భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో తలపడే జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు. విండీస్‌తో భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

Published : 26 Jan 2022 03:30 IST

దిల్లీ: భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో తలపడే జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు. విండీస్‌తో భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. రోహిత్‌ బుధవారం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్న్‌ెస్‌ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేస్తుంది. దక్షిణాఫ్రికాతో వన్డే    సిరీస్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సీనియర్‌ ఆటగాళ్లు అశ్విన్‌, భువనేశ్వర్‌ తమ స్థానాలు నిలబెట్టుకుంటారా లేదా అన్నది ఆసక్తికరం. మూడు వన్డేలు (ఫిబ్రవరి 6, 9, 11) అహ్మదాబాద్‌లో, మూడు టీ20లు (ఫిబ్రవరి 16, 18, 20) కోల్‌కతాలో జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని