ఆ మ్యాచ్లన్నీ క్వీన్స్టౌన్లో
భారత మహిళల క్రికెట్ జట్టుతో నిర్వహించాల్సిన అయిదు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్ను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు క్వీన్స్టౌన్కు తరలించింది. కరోనా నేపథ్యంలో ముప్పును తగ్గించేందుకు కివీస్ బోర్డు గురువారం
ఆక్లాండ్: భారత మహిళల క్రికెట్ జట్టుతో నిర్వహించాల్సిన అయిదు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్ను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు క్వీన్స్టౌన్కు తరలించింది. కరోనా నేపథ్యంలో ముప్పును తగ్గించేందుకు కివీస్ బోర్డు గురువారం తాజాగా కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ పర్యటన కోసం భారత జట్టు ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. ఫిబ్రవరి 9న క్వీన్స్టౌన్లోని జాన్ డేవిస్ ఓవల్లో ఈ సిరీస్ ఆరంభం కానుంది. అంతేకాక వంద మందికి మించి వీక్షకులను స్టేడియానికి అనుమతించకూడదని కివీస్ బోర్డు నిర్ణయించింది. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9న ఏకైక టీ20తో పాటు 11న తొలి వన్డేను కూడా నేపియర్లో భారత్ ఆడాల్సి ఉంది. రెండు, మూడు వన్డేలకు నెల్సన్ (14, 16 తేదీలు).. నాలుగు, అయిదు వన్డేలకు క్వీన్స్టౌన్ 22, 24 తేదీలు) వేదికగా వ్యవహరించాల్సి ఉంది. ఈ మార్చి-ఏప్రిల్లో ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో భారత జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)