విండీస్ జట్టులో రోచ్
భారత్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో పాల్గొనే వెస్టిండీస్ జట్టులో పేసర్ కీమర్ రోచ్ చోటు సంపాదించాడు. వచ్చే నెల 6న ఆరంభమయ్యే ఈ సిరీస్లో రోచ్తో పాటు యువ ఆల్రౌండర్ బోనర్కు కూడా స్థానం దక్కింది.
భారత్తో వన్డే సిరీస్
సెయింట్ జాన్స్: భారత్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో పాల్గొనే వెస్టిండీస్ జట్టులో పేసర్ కీమర్ రోచ్ చోటు సంపాదించాడు. వచ్చే నెల 6న ఆరంభమయ్యే ఈ సిరీస్లో రోచ్తో పాటు యువ ఆల్రౌండర్ బోనర్కు కూడా స్థానం దక్కింది. 2019లో చివరిగా వన్డే ఆడిన రోచ్ పునరాగమనం చేశాడు. ఇప్పటిదాకా 92 వన్డేలు ఆడిన ఈ పేసర్ 124 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్తో వన్డే సిరీస్ కోల్పోయిన పొలార్డ్ సారథ్యంలోని విండీస్ జట్టులో సెలక్టర్లు ఆరు మార్పులు చేశారు. ‘‘రోచ్ మా ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడు. ఆరంభంలో వికెట్లు పడగొట్టే బౌలర్లే కావాలి. మెరుగైన ఎకానమీ రేట్ ఉన్న బోనర్ కూడా మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు’’ అని చీఫ్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ చెప్పాడు. భారత్తో వన్డే సిరీస్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 6న తొలి వన్డే, 9, 11 తేదీల్లో రెండు, మూడో వన్డేలు జరుగుతాయి. మూడు టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతాలో 16, 18, 20 తేదీల్లో మ్యాచ్లు నిర్వహిస్తారు. వెస్టిండీస్ వన్డే జట్టు: పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, బోనర్, డారెన్ బ్రావో, బ్రూక్స్, హోల్డర్, హోప్, అకీల్ హోసెన్, జోసెఫ్, కింగ్, పూరన్, రోచ్, షెపర్డ్, ఒడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ