భారత అమ్మాయిలకు కాంస్యం

ఆసియాకప్‌ మహిళల హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలో దిగి టైటిల్‌ సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జట్టు.. కాంస్యంతో సంతృప్తి చెందింది. మరోవైపు టైటిల్‌ను జపాన్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 4-2తో

Published : 29 Jan 2022 02:19 IST

ఆసియాకప్‌ హాకీ

మస్కట్‌: ఆసియాకప్‌ మహిళల హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలో దిగి టైటిల్‌ సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జట్టు.. కాంస్యంతో సంతృప్తి చెందింది. మరోవైపు టైటిల్‌ను జపాన్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 4-2తో కొరియాను ఓడించింది. శుక్రవారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్‌ 2-0 గోల్స్‌తో చైనాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే భారత్‌ దూకుడుగా ఆడింది. వరుస అవకాశాలను సృష్టించుకుంది. 13వ నిమిషంలో షర్మిలాదేవి చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన మన జట్టు.. ఆ తర్వాత గుర్జీత్‌ కొట్టిన పెనాల్టీ కార్నర్‌ గోల్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. వెంటనే చైనా కూడా ఓ పెనాల్టీ కార్నర్‌ను దక్కించుకున్నా గోల్‌కీపర్‌ సవిత ప్రత్యర్థి గోల్‌ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఒకవైపు దాడుల నుంచి కాపాడుకుంటూనే.. చైనాపై ఒత్తిడిని పెంచిన  భారత్‌.. ఆఖరిదాకా అదే జోరు ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో మలేసియాను ఓడించి.. ఆ తర్వాత జపాన్‌ చేతిలో ఓడిన భారత్‌.. సింగపూర్‌పై నెగ్గి సెమీస్‌ చేరింది. సెమీస్‌లో భారత్‌.. కొరియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని