Team India: టీమ్ఇండియాకు కొవిడ్ దెబ్బ
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ ఇంకో మూడు రోజుల్లో ఆరంభం కాబోతుండగా భారత జట్టులో ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడటంతో కలకలం రేగింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్తో పాటు యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్,
ధావన్, శ్రేయస్, రుతురాజ్లకు పాజిటివ్!
దిల్లీ: వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ ఇంకో మూడు రోజుల్లో ఆరంభం కాబోతుండగా భారత జట్టులో ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడటంతో కలకలం రేగింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్తో పాటు యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ కరోనా పాజిటివ్గా తేలినట్లు సమాచారం. సహాయ సిబ్బందిలో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కొవిడ్ బారిన పడ్డట్లు తెలిసింది. పాజిటివ్గా తేలిన ఆటగాళ్ల సంఖ్య ముగ్గురి కంటే ఎక్కువని కూడా వార్తలొస్తున్నాయి. అయితే దీని గురించి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కొవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లు, సిబ్బందిని వెంటనే వేర్వేరు గదుల్లో ఐసొలేట్ చేసినట్లు తెలిసింది. గురువారం మరోసారి ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాక బీసీసీఐ ఏం చేయాలో నిర్ణయించనుంది. ఈ సిరీస్కు స్టాండ్బైలుగా ఎంపికైన షారుఖ్ ఖాన్, సాయికిశోర్, రిషి ధావన్ ప్రధాన జట్టులోకి ఎంపికవడం లాంఛనమే కావచ్చు. వన్డే, టీ20 కెప్టెన్గా ఎంపికయ్యాక రోహిత్ శర్మ ఆడబోయే తొలి సిరీస్ ఇదే. ధావన్, రుతురాజ్ అందుబాటులో లేకుండా పోవడంతో రోహిత్కు జోడీగా తొలి వన్డేలో వెంకటేశ్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశముంది. అహ్మదాబాద్లో మొతెరా స్టేడియం ఆతిథ్యమిచ్చే మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. తర్వాత కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్, విండీస్ మూడు టీ20లు ఆడతాయి. సిరీస్ కోసం ఇప్పటికే వెస్టిండీస్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్