Shaik Rasheed: ఆంధ్రా క్రికెటర్ రషీద్.. భవిష్యత్తు నంబర్ 3: ఎమ్మెస్కే ప్రసాద్
యశ్ ధుల్ నేతృత్వంలోని అండర్-19 జట్టు ప్రపంచకప్ గెలిచి అభిమానులందరినీ సంబరాల్లో ముంచెత్తింది. ఈ కుర్రాళ్ల జట్టు ఒక్క ఓటమి లేకుండా టోర్నీని ముగించారంటే ఎంత ఆధిపత్యాన్ని ప్రదర్శించారో
ముంబయి: యశ్ ధుల్ నేతృత్వంలోని అండర్-19 జట్టు ప్రపంచకప్ గెలిచి అభిమానులందరినీ సంబరాల్లో ముంచెత్తింది. ఈ కుర్రాళ్ల జట్టు ఒక్క ఓటమి లేకుండా టోర్నీని ముగించారంటే ఎంత ఆధిపత్యాన్ని ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. జట్టులో ఎందరో కుర్రాళ్లు తమ ఆటతో ఆకట్టుకున్నారు. అందులో ఒకడు వైస్ కెప్టెన్ రషీద్. ఈ 17 ఏళ్ల ఆంధ్ర కుర్రాడు టోర్నీలో 50.25 సగటుతో 201 పరుగులు చేశాడు. అతడి ప్రదర్శన పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశాడు ఆంధ్రకే చెందిన భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. రషీద్ భవిష్యత్తులో టీమ్ఇండియాకు మూడో స్థానంలో ఆడే బ్యాట్స్మన్గా మారే అవకాశముందని అన్నాడు. ‘‘భవిష్యత్తులో పరిమిత ఓవర్లు, టెస్టు క్రికెట్లో రషీద్ నంబర్ 3 కావొచ్చు’’ అని చెప్పాడు. ‘‘అతడు బంతిని ఆలస్యంగా ఆడతాడు. బంతిని ఎదుర్కొనేందుకు తగినంత సమయాన్ని తీసుకుంటాడు. అవి మంచి లక్షణాలు. అతడి సంయమనం కూడా ఆకట్టుకుంది. భారత్ ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడేమాత్రం ఇబ్బంది పడలేదు’’ అని ప్రసాద్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు