Yash Dhull: అరంగేట్రంలో అదుర్స్
భారత అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్ (113; 150 బంతుల్లో 18×4) అదరగొట్టాడు. రంజీ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్ యశ్ శతకంతో సత్తాచాటడంతో గురువారం తమిళనాడుతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూపు-హెచ్
సెంచరీతో మెరిసిన యశ్ ధుల్
తమిళనాడుతో దిల్లీ రంజీ మ్యాచ్
గువాహటి: భారత అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్ (113; 150 బంతుల్లో 18×4) అదరగొట్టాడు. రంజీ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్ యశ్ శతకంతో సత్తాచాటడంతో గురువారం తమిళనాడుతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూపు-హెచ్ పోరులో దిల్లీ మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్లకు 291 పరుగులు సాధించింది. ఒకదశలో దిల్లీ 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. నితీశ్ రానా (25) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. అయితే యశ్, జాంటీ సిద్ధు (71; 179 బంతుల్లో 8×4, 2×6) నాలుగో వికెట్కు 119 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. యశ్ చక్కని షాట్లతో అలరించాడు. తమిళనాడు పేసర్లు మహమ్మద్, సందీప్ వారియర్, శ్రవణ్ కుమార్ల బౌలింగ్లో అతడు ఆడిన పుల్ షాట్లు ఆకట్టుకున్నాయి. క్రీజులో చురుకుగా కదిలిన యశ్.. స్పిన్నర్లనూ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆట చివరికి లలిత్ యాదవ్ (45 బ్యాటింగ్; 87 బంతుల్లో 5×4, 1×6), సిమ్రన్జీత్సింగ్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సందీప్ వారియర్ (2/69), మహ్మద్ (2/40), బాబా అపరాజిత్ (2/63), విజయ్ శంకర్ (1/18) బంతితో రాణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు