Ishan Kishan: కోహ్లి మాటలే దృక్పథాన్ని మార్చాయి: ఇషాన్ కిషన్
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మాటలే క్రికెట్ పట్ల తన దృక్పథాన్ని మార్చాయని భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. ‘‘అవకాశాలు దక్కినప్పుడు పరుగులు చేస్తే చాలు.. అని కెరీర్
ముంబయి: మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మాటలే క్రికెట్ పట్ల తన దృక్పథాన్ని మార్చాయని భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. ‘‘అవకాశాలు దక్కినప్పుడు పరుగులు చేస్తే చాలు.. అని కెరీర్ ఆరంభంలో అనుకునేవాడిని. కానీ విరాట్ భాయ్, రోహిత్ భాయ్లను చూసిన తర్వాత.. వారు నెలకొల్పిన గమనించిన తర్వాత భిన్నంగా ఆలోచించడం ప్రారంభించా. ముఖ్యంగా కోహ్లి మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి. క్రికెట్ పట్ల నా దృక్పథాన్ని మార్చాయి ‘కొన్ని కావాలంటే పదిలో ఏడింటిని త్యాగం చేయాల్సి ఉంటుంది’ అన్న మాటలు నన్ను ప్రభావితం చేశాయి. భారత్కు ఆడిన ప్రతిసారీ వికెట్కీపర్ బ్యాట్స్మన్గానే బరిలో దిగాలని అనుకుంటా. కానీ ఇప్పటికే పంత్ ఆ స్థానంలో ఉన్నాడు. అందుకే దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోను’’ అని కిషన్ చెప్పాడు. ముంబయి ఇండియన్స్ వల్లే ఆటగాడిగా నిలదొక్కుకోగలిగానని కిషన్ చెప్పాడు. ‘‘నా కెరీర్ ఆరంభం నుంచి ముంబయి ఇండియన్స్ నాకెంతో మద్దతుగా నిలిచింది. నన్ను మంచి ఆటగాడిగా తయారు చేసింది. నా మీద ఎంతో నమ్మకముంచింది. వేలంలో మంబయి నన్ను దక్కించుకుంటుందన్న విశ్వాసంతోనే ఉన్నా. కానీ ఎంత మొత్తం వెచ్చిస్తుందని ఊహించలేదు. ఎందుకంటే ఐపీఎల్లో మెరుగైన జట్టు కావాలంటే డబ్బులు చేతిలో ఉండాలి. అయితే నాకోసం ఈసారి వేలంలోనే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టింది ముంబయి. ముంబయి తరఫున నాలుగేళ్లుగా ఆడుతున్నా. రెండుసార్లు విజేత అయిన జట్టులో సభ్యుడిగా ఉన్నా. ఆ జట్టు కుటుంబ సభ్యుడిలా అయిపోయా’’ అని కిషన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.