25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి

ఐపీఎల్‌ సందర్భంగా స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే స్టేడియాల సామర్థ్యంలో 25 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. వాళ్లు కూడా రెండు డోసుల టీకా తీసుకుని ఉండాలి. రాష్ట్రంలో

Updated : 03 Mar 2022 06:48 IST

ముంబయి: ఐపీఎల్‌ సందర్భంగా స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే స్టేడియాల సామర్థ్యంలో 25 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. వాళ్లు కూడా రెండు డోసుల టీకా తీసుకుని ఉండాలి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో స్టేడియాల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బుధవారం బీసీసీఐ, మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం అధికారులతో సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని