Delhi: దిల్లీకి ఎదురు దెబ్బ

మెగా టీ20 టోర్నీలో దిల్లీ జట్టుకు ఎదురు దెబ్బ! ఆ జట్టుకు బలంగా మారుతాడనుకున్న మిచెల్‌ మార్ష్‌ గాయపడ్డాడు. తుంటికి గాయం కావడంతో ఈ ఆస్ట్రేలియా...

Updated : 29 Mar 2022 07:31 IST

(Photo: Mitchell Marsh Instagram)

లాహోర్‌: మెగా టీ20 టోర్నీలో దిల్లీ జట్టుకు ఎదురు దెబ్బ! ఆ జట్టుకు బలంగా మారుతాడనుకున్న మిచెల్‌ మార్ష్‌ గాయపడ్డాడు. తుంటికి గాయం కావడంతో ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ టీ20 లీగ్‌లోనూ అతడు ఆడేది అనుమానంగా మారింది. మెగా వేలంలో రూ.6.5 కోట్లు వెచ్చించి మార్ష్‌ను దిల్లీ దక్కించుకుంది. పాకిస్థాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 6న మిచెల్‌ దిల్లీ జట్టుకు రావాల్సి ఉంది. ‘‘నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా మార్ష్‌ తొడకు గాయమైంది. కానీ మొదట గాయం తీవ్రత ఎంత అన్నది ఇంకా తెలియలేదు. కానీ ఫీల్డింగ్‌ సాధన చేస్తున్న సమయంలో నొప్పితో బాధ పడ్డాడు’’ అని ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని