Pat Cummins: నేనే ఎక్కువ ఆశ్చర్యపోయా

ముంబయిపై విధ్వంసకర ఇన్నింగ్స్‌ అందరి కంటే ఎక్కువగా తననే ఆశ్చర్యానికి గురి చేసిందని కోల్‌కతా ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు.

Published : 08 Apr 2022 08:17 IST

పుణె: ముంబయిపై విధ్వంసకర ఇన్నింగ్స్‌ అందరి కంటే ఎక్కువగా తననే ఆశ్చర్యానికి గురి చేసిందని కోల్‌కతా ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. కమిన్స్‌ కేవలం 15 బంతుల్లోనే 56 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ముంబయిని మ్యాచ్‌కు దూరం చేశాడు. 14 బంతుల్లోనే 50 పరుగులు రాబట్టి టీ20 క్రికెట్‌ లీగ్‌లో కేఎల్‌ రాహుల్‌ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును సమం చేశాడు. ‘‘బహుశా ఆ ఇన్నింగ్స్‌ నన్నే ఎక్కువ ఆశ్చర్యానికి గురి చేసిందని అనుకుంటున్నా. అలాంటి ఇన్నింగ్స్‌ ఆడినందుకు ఆనందంగా ఉంది. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మ్యాచ్‌ ముగింపు దశలో ఉంది. ఆ సమయంలో బంతిని బౌండరీ దాటించాలన్న ఆలోచనతోనే ఉన్నా. బుమ్రాను ఎదుర్కొన్నప్పుడల్లా వీలైనంత గట్టిగా కొట్టేందుకు ప్రయత్నించా. అదృష్టవశాత్తు కొన్నిసార్లు బంతి బయటకు వెళ్లింది. ఒక ఎండ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. నేను  కొన్ని షాట్లు ఆడితే వెంకీ పని సులువవుతుందని భావించా. తక్కువ దూరమున్న బౌండరీని లక్ష్యంగా చేసుకున్నా. ప్రతి బంతిని ఫోర్‌ లేదా సిక్సర్‌ బాదేందుకు ప్రయత్నించా’’ అని కమిన్స్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని