Aaron Finch: పిలుపు రాగానే ఎగిరి గంతేశా: ఆరోన్ ఫించ్
మెగా టోర్నీ కోసం ప్రస్తుత సీజన్లో కోల్కతా నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేసినట్లు ఆరోన్ ఫించ్ వెల్లడించాడు. మెగా వేలంలో అతణ్ని ఏ జట్టూ కొనుకోని సంగతి తెలిసిందే. కానీ బయో
నవీ ముంబయి: మెగా టోర్నీ కోసం ప్రస్తుత సీజన్లో కోల్కతా నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేసినట్లు ఆరోన్ ఫించ్ వెల్లడించాడు. మెగా వేలంలో అతణ్ని ఏ జట్టూ కొనుకోని సంగతి తెలిసిందే. కానీ బయో బబుల్ ఆందోళనతో అలెక్స్ హేల్స్ తప్పుకోవడంతో ఫించ్ను తన కనీస ధర రూ.1.5 కోట్లకు కోల్కతా తీసుకుంది. ‘‘ఇలాంటి ఉత్తమ పోటీ ఉండే టోర్నీల్లో ఆడడం గొప్పగా ఉంటుంది. ఒకవేళ లీగ్లో ఆడకపోతే మెగా టోర్నీను చాలా మిస్సవుతాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి సాధన చేయడం, ఆడడం ద్వారా ప్రతి ఒక్కరూ మెరుగవుతారు. అందుకే వేలంలో అమ్ముడుపోకపోవడంతో నిరాశ చెందా. కానీ జట్టుతో చేరమని కోల్కతా కోచ్ మెక్కలమ్ నుంచి ఫోన్ రాగానే ఉత్తేజంతో ఎగిరి గంతేశా’’ అని ఫించ్ తెలిపాడు. టోర్నీలో తన సహచర ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ బ్యాటింగ్ ఆకట్టుకుంటోందని అతనన్నాడు. ముంబయిపై మ్యాచ్లో కోల్కతా తరపున కమిన్స్ 14 బంతుల్లోనే అర్ధశతకం చేసిన విషయం విదితమే. ‘‘14 బంతుల్లోనే కమిన్స్ అర్ధశతకం చేయడం షాక్ కలిగించింది. ఆస్ట్రేలియాకు ఆడేటప్పటి కంటే కూడా ఈ టోర్నీలో ఉత్తమంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కోల్కతా తరపున కొన్ని గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. తన బ్యాటింగ్ మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఏడో స్థానంలో వచ్చి దూకుడుతో బ్యాటింగ్ చేస్తున్న అతణ్ని చూస్తుంటే గొప్పగా ఉంది. మరోవైపు ఎత్తుగా ఉండే వెంకటేశ్ అయ్యర్కు బ్యాటింగ్లో చాలా అవకాశాలుంటాయి. రెండు వైపులా షాట్లు ఆడే సామర్థ్యం అతనికి ఉంది. జట్టు దూకుడు నాకిష్టం. అందుకే కోల్కతా అంటే ప్రత్యర్థులు భయపడతారు’’ అని ఫించ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం