IND vs SA: రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి.. హార్దిక్కు కెప్టెన్సీ!
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్కు టీమ్ఇండియా ద్వితియ శ్రేణి జట్టును బరిలో దింపే అవకాశముంది. జులైలో ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో.. అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, పంత్,
దిల్లీ: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్కు టీమ్ఇండియా ద్వితియ శ్రేణి జట్టును బరిలో దింపే అవకాశముంది. జులైలో ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో.. అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, పంత్, రాహుల్, బుమ్రాలకు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. ఈ సిరీస్తో పాటు, ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల సిరీస్ కోసం శిఖర్ ధావన్, ఆల్రౌండ్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ రేసులో ఉన్నారు. గుజరాత్ను విజయవంతంగా నడిపిస్తున్న హార్దిక్కు పగ్గాలు లభించే అవకాశం ఎక్కువ! దక్షిణాఫ్రికాతో అయిదు మ్యాచ్ల సిరీస్ జూన్ 9న దిల్లీలో ఆరంభం కానుంది. మిగతా మ్యాచ్లకు కటక్, విశాఖపట్నం, రాజ్కోట్, బెంగళూరు ఆతిథ్యమిస్తాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్కు ఈ నెల 22న భారత జట్టును ప్రకటించే అవకాశముంది. ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా.. గతంలో వాయిదా పడ్డ అయిదో టెస్టుతో పాటు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ