Nikhat Zareen: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ పతక పంచ్
జూనియర్ స్థాయిలో సంచలనాలు నమోదు చేస్తూ ప్రపంచ ఛాంపియన్ కూడా అయిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. ఇప్పుడు సీనియర్ స్థాయిలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన 25 ఏళ్ల నిఖత్.. ఇప్పుడు ఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకం ఖాయం చేసింది. ఇస్తాంబుల్లో జరుగుతున్న టోర్నీలో 52 కేజీల విభాగంలో ఆమె సెమీస్ చేరుకుంది. సోమవారం క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5-0తో ఇంగ్లాండ్ బాక్సర్ చార్లీ సియాన్
ప్రపంచ ఛాంపియన్షిప్ సెమీస్లోకి ప్రవేశం
మనీషా, పర్వీన్లకూ పతకాలు ఖాయం
దిల్లీ
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ వేదికపై అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకుంది. బాక్సింగ్లో అత్యున్నత టోర్నీ అయిన ప్రపంచ ఛాంపియన్షిప్లో సెమీస్ చేరడం ద్వారా ఆమె పతకం ఖరారు చేసుకుంది. ఇంకో రెండు విజయాలు సాధిస్తే ప్రపంచ ఛాంపియన్ అవుతుంది.
జూనియర్ స్థాయిలో సంచలనాలు నమోదు చేస్తూ ప్రపంచ ఛాంపియన్ కూడా అయిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. ఇప్పుడు సీనియర్ స్థాయిలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన 25 ఏళ్ల నిఖత్.. ఇప్పుడు ఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకం ఖాయం చేసింది. ఇస్తాంబుల్లో జరుగుతున్న టోర్నీలో 52 కేజీల విభాగంలో ఆమె సెమీస్ చేరుకుంది. సోమవారం క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5-0తో ఇంగ్లాండ్ బాక్సర్ చార్లీ సియాన్ డేవిసన్పై విజయం సాధించింది. ఇటీవలే స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం గెలిచి ఊపుమీదున్న నిఖత్.. చార్లీతో పోరుతో వ్యూహాత్మకంగా ఆడింది. ఇరువురు బాక్సర్లూ దూకుడుగానే బౌట్ను మొదలుపెట్టారు. అయితే నిఖత్ కచ్చితమైన పంచ్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలి రౌండ్లో చార్లీ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ నిఖత్దే పైచేయి అయింది. రెండో రౌండ్లో పూర్తిగా తన ఆధిపత్యమే సాగింది. వరుసగా రెండు రౌండ్లలో పైచేయి సాధించడంతో తర్వాత నిఖత్ దూకుడు తగ్గించింది. సెమీస్లో నిఖత్.. కరోలిన్ డి అల్మీడియా (బ్రెజిల్)ను ఢీకొంటుంది. టోర్నీలో భారత్కు ఇంకో రెండు పతకాలు ఖరారయ్యాయి. 57 కేజీల విభాగంలో మనీషా, 63 కేజీల్లో పర్వీన్ కూడా సెమీస్ చేరుకున్నారు. క్వార్టర్స్లో మనీషా 4-1తో నమున్ (మంగోలియా)ను ఓడించగా.. పర్వీన్ 5-0తో షోయిరా (తజికిస్థాన్)ను చిత్తు చేసింది. 48 కేజీల విభాగంలో నీతుకు, 81 కేజీల్లో పూజా రాణికి నిరాశ తప్పలేదు. క్వార్టర్స్లో నీతు 2-3తో అలువా (కజకిస్థాన్) చేతిలో, పూజా రాణి 2-3తో జెస్సికా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. అనామిక (50 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), నందిని (81+) కూడా క్వార్టర్స్లోనే ఇంటిముఖం పట్టారు.
‘‘ఈ రోజు ప్రత్యర్థి నా కంటే పొడవుగా ఉంది. ఆమెకు కుడి చేయే ప్రధాన బలం. దాన్ని సమర్థంగా అడ్డుకోవడమే నా వ్యూహం. అది ఫలించింది. దేశానికి తొలి పతకం ఖరారు చేయడం సంతోషంగా ఉంది. స్వర్ణం కూడా గెలవగలను’’
- నిఖత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..