ఆర్చరీలో మరో కాంస్యం

ప్రపంచకప్‌ స్టేజ్‌- 2 ఆర్చరీ టోర్నీలో భారత్‌ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రికర్వ్‌ మహిళల టీమ్‌ విభాగంలో రిధి, కోమలిక, అంకిత త్రయం మూడో స్థానంలో నిలిచింది. గురువారం కంచు పతక

Published : 20 May 2022 02:14 IST

గ్వాంగ్జు: ప్రపంచకప్‌ స్టేజ్‌- 2 ఆర్చరీ టోర్నీలో భారత్‌ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రికర్వ్‌ మహిళల టీమ్‌ విభాగంలో రిధి, కోమలిక, అంకిత త్రయం మూడో స్థానంలో నిలిచింది. గురువారం కంచు పతక పోరులో భారత్‌ 6-2 (56-52, 54-51, 54-55, 55-54) తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. నిలకడైన ప్రదర్శనతో సత్తాచాటిన అమ్మాయిలు ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేశారు. తొలి 12 బాణాలకు గాను మూడు సార్లు 10, ఎనిమిది సార్లు తొమ్మిది చొప్పున పాయింట్లు సాధించారు. ఆ తర్వాత కాస్త తడబడ్డా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పోయింది. అంతకుముందు సెమీస్‌లో భారత్‌   2-6 (53-55, 57-55, 51-53, 43-53)తో  కొరియా చేతిలో పరాజయం పాలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని