దిల్లీ ప్లేఆఫ్స్‌ చేరేనా!

టీ20 లీగ్‌లో దిల్లీ కీలక సమరానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆ జట్టు భవిష్యత్తును నిర్దేశించే మ్యాచ్‌లో శనివారం ముంబయిను ఢీకొంటుంది. ఒకరకంగా ఆ జట్టుకు ఇది క్వార్టర్‌ఫైనల్‌ లాంటి మ్యాచ్‌. ఇప్పటికే ఏడు విజయాలు సాధించిన దిల్లీ..

Published : 21 May 2022 02:28 IST

నేడు ముంబయితో దిల్లీ ఢీ

ముంబయి: టీ20 లీగ్‌లో దిల్లీ కీలక సమరానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆ జట్టు భవిష్యత్తును నిర్దేశించే మ్యాచ్‌లో శనివారం ముంబయిను ఢీకొంటుంది. ఒకరకంగా ఆ జట్టుకు ఇది క్వార్టర్‌ఫైనల్‌ లాంటి మ్యాచ్‌. ఇప్పటికే ఏడు విజయాలు సాధించిన దిల్లీ.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బెంగళూరు కూడా ఎనిమిది విజయాలు సాధించినప్పటికీ.. రన్‌రేట్‌లో దిల్లీ కంటే బాగా వెనుకబడి ఉంది. కాబట్టి దిల్లీ మామూలుగా గెలిచినా.. బెంగళూరును వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్‌ చేరుతుంది. ముంబయి చేతిలో ఓడిపోతే టోర్నీలో దిల్లీ కథ ముగుస్తుంది. అప్పుడు బెంగళూరు ముందంజ వేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని