పంతే సరైనోడు
రిషబ్ పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని దిల్లీ కెప్టెన్గా అతడు సరైన ప్రత్యామ్నాయమని ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు.
ముంబయి: రిషబ్ పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని దిల్లీ కెప్టెన్గా అతడు సరైన ప్రత్యామ్నాయమని ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ సీజన్లో పంత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై అభిమానుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో పాంటింగ్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘దిల్లీకి కెప్టెన్ రిషబ్ పంత్ సరైన ప్రత్యామ్నాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత దిల్లీని రిషబ్ సమర్థంగా నడిపించాడు. రిషబ్ ఇంకా కుర్రాడే. సారథ్యంలో లోటుపాట్లను ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు. ఇలాంటి లీగ్లో తీవ్రమైన ఒత్తిడి ఉంటే టోర్నీలో సారథ్యం అంత సులభం కాదు. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని అంతా నిశితంగా గమనిస్తారు. అందుకే పంత్కు మద్దతు ఇస్తున్నా’’ అని రికీ చెప్పాడు. ముంబయితో మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన పంత్ ఒక్కడినే నిందించడం తగదని.. టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా ఓ కారణమని పాంటింగ్ అన్నాడు. ‘‘ముంబయితో మ్యాచ్లో ఆఖరి ఓవర్లలో మ్యాచ్ మా చేజారిపోయింది. ఇందుకు కెప్టెన్ పంత్ను ఒక్కడినే బాధ్యుడిని చేయలేం. మా టాప్ ఆర్డర్ వైఫల్యం వల్లే జట్టు సరైన స్కోరు చేయలేకపోయింది. ఈ సీజన్లో మా బ్యాటర్లు స్థిరంగా రాణించలేకపోయారు’’ రికీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్