ఒలింపిక్స్లోనూ ఛాంపియనవుతా: నిఖత్
ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తాను.. ఇలాగే కష్టపడుతూ ఒలింపిక్స్లోనూ ఛాంపియన్ అవుతానని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్
దిల్లీ: ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తాను.. ఇలాగే కష్టపడుతూ ఒలింపిక్స్లోనూ ఛాంపియన్ అవుతానని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్.. సహచర బాక్సర్లతో కలిసి మంగళవారం దిల్లీకి చేరుకుంది. ఆమెతో పాటు టోర్నీలో కాంస్యాలు గెలిచిన మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు)లను ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ), కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సన్మానించాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాఘ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖత్ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. నేనిలా కష్టపడతానని, భవిష్యత్తులోనూ దేశం గర్వించేలా చేస్తానని హామీ ఇస్తున్నా. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ అయ్యా. దేవుడు కరుణిస్తే ఒలింపిక్ ఛాంపియన్గా అందరి ముందూ నిలుస్తా’’ అని నిఖత్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలిక ఇదే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...