అక్సెల్సెన్తో కలిసి లక్ష్యసేన్ శిక్షణ
భారత వర్ధమాన ఆటగాడు లక్ష్యసేన్ దుబాయ్లో ప్రపంచ నంబర్వన్ విక్టర్ అక్సెల్సెన్తో కలిసి సాధన చేయనున్నాడు. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల నేపథ్యంలో లక్ష్యసేన్ దుబాయ్లో శిక్షణ తీసుకునేందుకు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) ఆమోదం తెలిపింది
దిల్లీ: భారత వర్ధమాన ఆటగాడు లక్ష్యసేన్ దుబాయ్లో ప్రపంచ నంబర్వన్ విక్టర్ అక్సెల్సెన్తో కలిసి సాధన చేయనున్నాడు. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల నేపథ్యంలో లక్ష్యసేన్ దుబాయ్లో శిక్షణ తీసుకునేందుకు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) ఆమోదం తెలిపింది. ‘‘ఈనెల 29 నుంచి జూన్ 5 వరకు దుబాయ్లో అక్సెల్సెన్తో కలిసి లక్ష్యసేన్ సాధన చేస్తాడు. జూన్ 19 నుంచి 26 వరకు కౌలాలంపూర్లోని మలేసియన్ ట్రెయినింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటాడు’’ అని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యక్తిగత ఫిట్నెస్ ట్రెయినర్ శ్రీకాంత్ తనతో పాటు విదేశాలకు తీసుకెళ్తానన్న పి.వి.సింధు అభ్యర్థనకు టాప్స్ పథకం కింద ఎంఓసీ ఆమోదముద్ర వేసింది. ‘‘ఇండోనేసియా మాస్టర్స్ (జూన్ 7-12), ఇండోనేసియా ఓపెన్ (జూన్ 14-19), మలేసియా మాస్టర్స్ (జూన్ 28- జులై 3), మలేసియా ఓపెన్ (జులై 5-10), సింగపూర్ ఓపెన్ (జులై 12-17)లకు సింధుతో కలిసి శ్రీకాంత్ వెళ్లనున్నాడు’’ అని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్