Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు స్వర్ణం

ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోర్టానె గేమ్స్‌ జావెలిన్‌ త్రోలో అతడు స్వర్ణం గెలుచుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో అతడు రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా)ను ఓడించాడు. 24 ఏళ్ల నీరజ్‌ తన తొలి ప్ర

Updated : 19 Jun 2022 06:55 IST

దిల్లీ: ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోర్టానె గేమ్స్‌ జావెలిన్‌ త్రోలో అతడు స్వర్ణం గెలుచుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో అతడు రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా)ను ఓడించాడు. 24 ఏళ్ల నీరజ్‌ తన తొలి ప్రయత్నంలో 86.69 మీటర్లు విసిరాడు. అదే అత్యుత్తమ త్రో అయింది. వాల్కట్‌ (86.64మీ) రజతం, పీటర్స్‌ (84.75) కాంస్యం గెలుచుకున్నారు. నీరజ్‌ మంగళవారం 89.30 మీటర్ల త్రోతో పావో నుర్మి క్రీడల్లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ పీటర్స్‌ 86.60మీ త్రోతో కాంస్యం సాధించాడు. నుర్మి క్రీడల్లో స్వర్ణం సాధించిన హెలాండర్‌ తాజా ఈవెంట్లో పోటీపడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని