భారత్ 0.. ఇటలీ 7
భారత్ అండర్-17 మహిళల జట్టుకు చేదు అనుభవం. నాలుగు దేశాల టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో ఆ జట్టు 0-7తో ఇటలీ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ పోరులో తొలి పది నిమిషాల వరకు ప్రత్యర్థిని కాచుకున్న భారత్.. ఆ తర్వాత చేతులెత్తేసింది.
ఉడిన్ (ఇటలీ): భారత్ అండర్-17 మహిళల జట్టుకు చేదు అనుభవం. నాలుగు దేశాల టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో ఆ జట్టు 0-7తో ఇటలీ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ పోరులో తొలి పది నిమిషాల వరకు ప్రత్యర్థిని కాచుకున్న భారత్.. ఆ తర్వాత చేతులెత్తేసింది. మారియా రోసి (11వ ని) చేసిన గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన ఇటలీ.. ఆ తర్వాత వరుస దాడులు చేసింది. లాంగోబార్డి (31వ ని), డ్రాగోని (33వ ని), సిబికా (48వ ని) స్వల్ప వ్యవధిలో గోల్స్ కొట్టడంతో 4-0 ఆధిక్యంలో నిలిచిన ఇటలీ.. ఆ తర్వాత మరో మూడుసార్లు బంతిని నెట్లోకి పంపి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్టోబర్లో భారత్ వేదికగా జరిగే అండర్-17 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా మన జట్టు ఈ టోర్నీలో ఆడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?