ఫైనల్లో సురేఖ జోడీ

తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో పతకం చేరింది. ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ- జ్యోతి సురేఖ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం సెమీఫైనల్లో అభిషేక్‌-జ్యోతి జంట 156-151తో రాబిన్‌ జాత్మా- లిజెల్‌ జాత్మా (ఇస్తోనియా) జంటపై విజయం సాధించింది.

Updated : 25 Jun 2022 02:35 IST

ఆర్చరీ ప్రపంచకప్‌

పారిస్‌: తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో పతకం చేరింది. ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ- జ్యోతి సురేఖ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం సెమీఫైనల్లో అభిషేక్‌-జ్యోతి జంట 156-151తో రాబిన్‌ జాత్మా- లిజెల్‌ జాత్మా (ఇస్తోనియా) జంటపై విజయం సాధించింది. అంతకుముందు ఎల్‌ సాల్వడోర్‌ బృందంతో క్వార్టర్‌ఫైనల్లో జ్యోతి జంటకు కఠిన పోరు ఎదురైంది. 155-155తో స్కోరు సమం కాగా భారత ద్వయం షూటాఫ్‌లో విజయం సాధించింది. శనివారం ఫైనల్లో అయిదో సీడ్‌ ఫ్రాన్స్‌తో సురేఖ-అభిషేక్‌ జోడీ తలపడుతుంది. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పెద్ద టోర్నీలో బరిలో దిగిన ప్రపంచ నం.3 జ్యోతి వ్యక్తిగత విభాగంలోనూ పతకం దిశగా సాగుతోంది. ఇప్పటికే ఆమె సెమీస్‌ చేరుకుంది. రికర్వ్‌లో భారత మహిళల జట్టు ఇప్పటికే ఫైనల్‌ చేరుకుని పతకం ఖాయం చేసుకుంది. రికర్వ్‌ మిక్స్‌డ్‌లో తరుణ్‌దీప్‌ రాయ్‌- అంకిత జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి రౌండ్లో షూటాఫ్‌లో రాయ్‌- అంకిత జోడీ 4-5 (18-20)తో కజకిస్తాన్‌ జంట చేతిలో జోడీ ఓడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు