మను పసిడి ‘డబుల్‌’

భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ సత్తా చాటింది. కుమార్‌ సురేంద్ర సింగ్‌ స్మారక జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళలు, జూనియర్‌ విభాగాల్లో ఆమె స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లో 20 ఏళ్ల మను 263.9 స్కోరుతో పసిడి ఎగరేసుకుపోయింది. అర్ష్‌దీప్‌

Published : 25 Jun 2022 02:15 IST

భోపాల్‌: భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ సత్తా చాటింది. కుమార్‌ సురేంద్ర సింగ్‌ స్మారక జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళలు, జూనియర్‌ విభాగాల్లో ఆమె స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లో 20 ఏళ్ల మను 263.9 స్కోరుతో పసిడి ఎగరేసుకుపోయింది. అర్ష్‌దీప్‌ (260.5) రజతంతో సంతృప్తి పడగా.. రాధిక (హరియాణా) కాంస్యం గెలుచుకుంది. జూనియర్‌ విభాగంలో 249 పాయింట్లతో మను స్వర్ణం సాధించింది. యువిక (252.7) రజతం నెగ్గగా.. లక్షిత (246.7) కాంస్యం గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని