ఆఖరి వన్డే ఆసీస్‌దే

శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఆస్ట్రేలియా చివరిదైన అయిదో వన్డేలో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 4 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. మొదట లంక 43.1 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. 85/8తో కష్టాల్లో ఉన్న జట్టుకు చమిక కరుణరత్నే (75; 75 బం

Published : 25 Jun 2022 02:15 IST

కొలంబో: శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఆస్ట్రేలియా చివరిదైన అయిదో వన్డేలో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 4 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. మొదట లంక 43.1 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. 85/8తో కష్టాల్లో ఉన్న జట్టుకు చమిక కరుణరత్నే (75; 75 బంతుల్లో 84, 26), మధుషాన్‌ (15)తో కలిసి లంకకు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌, కునెమాన్‌, కమిన్స్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో ఆస్ట్రేలియా 50/4తో తడబడింది. అయితే అలెక్స్‌ కేరీ (45 నాటౌట్‌), లబుషేన్‌ (31) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆఖర్లో కామెరూన్‌ గ్రీన్‌ (25 నాటౌట్‌)తో కలిసి కేరి జట్టును గెలిపించాడు. ఆసీస్‌ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో సిరీస్‌ను లంక 3-2తో ముగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని