లక్ష్యం 296.. ఇంగ్లాండ్ 183/2
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను ఇప్పటికే 2-0తో చేజిక్కించుకున్న ఇంగ్లాండ్.. చివరిదైన మూడో టెస్టునూ నెగ్గే దిశగా అడుగులేస్తోంది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. నాలుగో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 183/2తో నిలిచింది. 51 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ను
లీడ్స్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను ఇప్పటికే 2-0తో చేజిక్కించుకున్న ఇంగ్లాండ్.. చివరిదైన మూడో టెస్టునూ నెగ్గే దిశగా అడుగులేస్తోంది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. నాలుగో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 183/2తో నిలిచింది. 51 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ను జో రూట్ (55 బ్యాటింగ్; 80 బంతుల్లో 74, 16)తో కలిసి ఓలీ పోప్ (81 బ్యాటింగ్, 105 బంతుల్లో 124) పటిష్ట స్థితికి చేర్చాడు. 8 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లాండ్ చివరి రోజు విజయానికి 113 పరుగులు చేయాలి. అంతకుముందు 168/5తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన న్యూజిలాండ్.. 326 పరుగులకు ఆలౌటైంది. బ్లండెల్ (88 నాటౌట్), మిచెల్ (56) రాణించడంతో ఒక దశలో 274/5తో ఉన్న కివీస్.. లీచ్ (5/66), పాట్స్ (3/66)ల ధాటికి 52 పరుగుల తేడాలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా