కష్టాల్లో బంగ్లా

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు.. రెండో మ్యాచ్‌లోనూ కష్టాలు తప్పట్లేదు. విండీస్‌కు 174 పరుగుల భారీ ఆధిక్యం కోల్పోయిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ఆఖరుకు 132/6తో నిలిచింది. నజ్ముల్‌ శాంటో (42) మినహా ఎవ్వరూ క్రీజులో నిలవలేదు. కీ

Published : 28 Jun 2022 01:29 IST

గ్రాస్‌ ఐలట్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు.. రెండో మ్యాచ్‌లోనూ కష్టాలు తప్పట్లేదు. విండీస్‌కు 174 పరుగుల భారీ ఆధిక్యం కోల్పోయిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ఆఖరుకు 132/6తో నిలిచింది. నజ్ముల్‌ శాంటో (42) మినహా ఎవ్వరూ క్రీజులో నిలవలేదు. కీమర్‌ రోచ్‌ (3/32), అల్జారి జోసెఫ్‌ (2/31) ఆ జట్టును దెబ్బ తీశారు. నురుల్‌ (16), మెహదీ హసన్‌ మిరాజ్‌ (0) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు వర్షం వల్ల మధ్యాహ్నం వరకు ఆట సాధ్యపడలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 234 పరుగులకే కుప్పకూలగా.. విండీస్‌ 408 పరుగులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు