బోణీ కొట్టిన భారత్
శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్లోనూ శుభారంభం చేసింది. శుక్రవారం తొలి మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది.
పల్లెకెలె: శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్లోనూ శుభారంభం చేసింది. శుక్రవారం తొలి మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. దీప్తిశర్మ (3/25), రేణుక సింగ్ (3/29) ప్రత్యర్థిని కట్టడి చేశారు. టీమ్ఇండియా తరఫున ఎనిమిది మంది బౌలింగ్ చేయడం విశేషం. భారత్ 38 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఛేదనలో భారత్ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (4), యాస్తిక (1) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఈ స్థితిలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (44; 63 బంతుల్లో 3×4).. షెఫాలివర్మ (35; 40 బంతుల్లో 1×4, 2×6), హర్లీన్ డియోల్ (34; 40 బంతుల్లో)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. హర్మన్, హర్లీన్, రిచా (6) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో 138/6తో టీమ్ఇండియా ఇబ్బందుల్లో పడ్డట్టు అనిపించింది. ౖకానీ దీప్తి (22 నాటౌట్).. పూజ (21 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించింది. లంక బౌలర్లలో ఇనోక(4/39) రాణించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు