ఇంగ్లాండ్‌తో టీ20, వన్డేలకు భారత జట్లివే

ఇంగ్లాండ్‌ టీ20, వన్డే సిరీస్‌కు భారత జట్లను ప్రకటించారు. కరోనాతో టెస్టు మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌ మొత్తానికి అందుబాటులో ఉంటాడు.

Published : 02 Jul 2022 03:51 IST

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌ టీ20, వన్డే సిరీస్‌కు భారత జట్లను ప్రకటించారు. కరోనాతో టెస్టు మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. టీ20 సిరీస్‌ ఈ నెల 7న ఆరంభమవుతుంది. నిజానికి రోహిత్‌ రెండో టీ20 నుంచి ఆడాల్సింది. కానీ టెస్టు మ్యాచ్‌కు దూరమైనందున తొలి టీ20కి కూడా అందుబాటులోకి వచ్చాడు. కోహ్లి, పంత్‌, బుమ్రా సహా అయిదుగురు ఆటగాళ్లు రెండో టీ20 నుంచి జట్టుతో చేరతారు. షమికి టీ20 జట్టులో చోటు దక్కలేదు. గత టీ20 ప్రపంచకప్‌ నుంచి అతణ్ని పొట్టి ఫార్మాట్‌కు ఎంపిక చేయట్లేదు. అతడు వన్డే జట్టులో ఉన్నాడు. వన్డే సిరీస్‌ ఈ నెల 15న మొదలవుతుంది.

ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి జట్టు: రోహిత్‌, కిషన్‌, రుతురాజ్‌, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, వెంకటేశ్‌ అయ్యర్‌, చాహల్‌, అక్షర్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌, ఉమ్రాన్‌

ఇంగ్లాండ్‌తో 2వ, 3వ టీ20కి జట్టు: రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, చాహల్‌, అక్షర్‌, రవి బిష్ణోయ్‌, బుమ్రా, భువనేశ్వర్‌, అవేష్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌

వన్డే జట్టు: రోహిత్‌, ధావన్‌, ఇషాన్‌ కిషన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌, చాహల్‌, అక్షర్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌, షమి, సిరాజ్‌, అర్ష్‌దీప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని