ఈసారి అంతకుమించి..
కోల్కతా: కామన్వెల్త్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు గతంలో కంటే ఈసారి మిన్నగా రాణిస్తుందని భావిస్తున్నట్లు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ‘‘థామస్కప్లో విజయాన్ని చూస్తే భారత పురుషుల జట్టు రాబోయే కామన్వెల్త్ క్రీడల్లో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసేలా కనిపిస్తోంది. పురుషుల సింగిల్స్, డబుల్స్లో కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఒక జట్టుగా థామస్కప్లో భారత్ సాధించిన విజయం చాలా పెద్దది. ఈ స్థాయిలో పురుషుల విభాగంలో మనమెప్పుడూ ఇంతగా రాణించలేదు’’ అని గోపి చెప్పాడు. ప్రకాశ్ పదుకొనె (1978), సయ్యద్ మోదీ (1982), పారుపల్లి కశ్యప్ (2014) మాత్రమే ఇప్పటిదాకా పురుషుల సింగిల్స్లో స్వర్ణాలు నెగ్గారు. 2018 గోల్డ్కోస్ట్ క్రీడల్లో బ్యాడ్మింటన్లో భారత్ రెండు స్వర్ణాలతో సహా ఆరు పతకాలు గెలుచుకుంది. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ స్వర్ణం గెలవగా.. సింధు రజతం సాధించింది. మిక్స్డ్ టీమ్లోనూ జట్టు పసిడి సాధించింది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్.. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి రజతం నెగ్గారు. మహిళల డబుల్స్లో అశ్విని-సిక్కిరెడ్డి కాంస్యం సొంతం చేసుకున్నారు. బర్మింగ్హామ్లో జులై 28న కామన్వెల్త్ క్రీడలు ఆరంభంకానున్నాయి.
సింధు బదులు తీర్చుకుంటుంది: పి.వి.సింధు పదే పదే చైనీస్ తైపీ స్టార్ తైజు యింగ్ చేతిలో ఓడడం కాస్త ఆందోళన కలిగించేదే అయినా భవిష్యత్లో ఈ ఓటములకు సింధు బదులు తీర్చుకుంటుందని గోపి అన్నాడు. ‘‘తైజు యింగ్ చేతిలో సింధు ఓటములపై దృష్టి పెట్టాల్సి ఉంది. నైపుణ్యం విషయంలో సింధు, తైజు ఇద్దరూ సమానమే. కోచ్ పార్క్తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. తైజుపై వరుస పరాజయాలకు భవిష్యత్లో సింధు బదులు తీర్చుకుంటుంది’’ అని గోపీ పేర్కొన్నాడు. తైజుతో ఇప్పటిదాకా 21సార్లు తలపడిన సింధు 16 మ్యాచ్ల్లో ఓడిపోయింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలి: హైకోర్టు
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
Politics News
Kejriwal: సంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. ఇదెక్కడి ప్రభుత్వం..?
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
General News
TS Eamcet: రేపు ఉదయం ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
-
Politics News
Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్కు తీవ్ర గాయాలు
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్