ఫైనల్లో కలైవాణి

ఎల్డోరా కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్లో భారత బాక్సర్‌ కలైవాణి శ్రీనివాసన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కజకిస్థాన్‌లోని నూర్‌ సుల్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 48 కేజీల సెమీఫైనల్లో ఆమె.. ఫార్జానా ఫొజీవా

Published : 03 Jul 2022 04:00 IST

దిల్లీ: ఎల్డోరా కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్లో భారత బాక్సర్‌ కలైవాణి శ్రీనివాసన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కజకిస్థాన్‌లోని నూర్‌ సుల్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 48 కేజీల సెమీఫైనల్లో ఆమె.. ఫార్జానా ఫొజీవా (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించింది. పురుషుల విభాగంలో కుల్‌దీప్‌ కుమార్‌ (48 కేజీలు) కూడా సెమీస్‌ చేరి పతకం ఖాయం చేశాడు. క్వార్టర్స్‌లో కుల్‌దీప్‌ 3-2తో కైరత్‌ యెనర్‌ (కజకిస్థాన్‌)పై విజయం సాధించాడు. 71 కేజీల క్వార్టర్స్‌లో యశ్‌పాల్‌ 0-5తో అస్లాన్‌బెక్‌ (కజకిస్థాన్‌) చేతిలో ఓడగా.. బబితా బిస్త్‌ (81 కేజీలు), జ్యోతి (52 కేజీలు), నీమా (63 కేజీలు) సెమీస్‌లో పరాజయం పాలై కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. 50 కేజీల క్వార్టర్స్‌లో సవిత 0-5తో సుకమి (జపాన్‌) చేతిలో ఓటమి చవిచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని