డెర్బీషైర్‌పై భారత్‌ విజయం

ఫామ్‌లో ఉన్న దీపక్‌ హుడా (59; 37 బంతుల్లో 54, 26) జోరు కొనసాగించడంతో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు డెర్బీషైర్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Published : 03 Jul 2022 04:00 IST

డెర్బీ (ఇంగ్లాండ్‌): ఫామ్‌లో ఉన్న దీపక్‌ హుడా (59; 37 బంతుల్లో 54, 26) జోరు కొనసాగించడంతో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు డెర్బీషైర్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట డెర్బీషైర్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులు చేసింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/29), ఉమ్రాన్‌ మాలిక్‌ (2/31) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో 5 పరుగులకే రుతురాజ్‌ (3) వికెట్‌ పడినా.. సంజు శాంసన్‌ (38)తో కలిసి హుడా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సంజు ఔటైనా.. సూర్యకుమార్‌ (36 నాటౌట్‌)తో కలిసి అతడు జట్టును విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో హుడా వెనుదిరిగినా.. కార్తీక్‌ (7 నాటౌట్‌)తో కలిసి సూర్య పని పూర్తి చేశాడు. లక్ష్యాన్ని భారత్‌ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని