ఓపెన్ విభాగంలో మూడు జట్లతో..
జులై 28న ఆరంభమయ్యే చెస్ ఒలింపియాడ్లో ఓపెన్ విభాగంలో ఆతిథ్య భారత్ మూడు జట్లను బరిలో దింపుతోంది. మూడో జట్టులో సూర్య శేఖర గంగూలీ, కార్తికేయన్ మురళీ, సేతురామన్, అభిజిత్ గుప్తా, అభిమన్యు పురాణిక్ సభ్యులుగా ఉండనున్నారు.
చెన్నై: జులై 28న ఆరంభమయ్యే చెస్ ఒలింపియాడ్లో ఓపెన్ విభాగంలో ఆతిథ్య భారత్ మూడు జట్లను బరిలో దింపుతోంది. మూడో జట్టులో సూర్య శేఖర గంగూలీ, కార్తికేయన్ మురళీ, సేతురామన్, అభిజిత్ గుప్తా, అభిమన్యు పురాణిక్ సభ్యులుగా ఉండనున్నారు. ఓపెన్ విభాగంలో భారత్-ఎ జట్టు మూడో సీడ్గా పోటీలో ఉండగా.. ‘బి’ జట్టుకు 11వ సీడింగ్ లభించింది. ‘ఎ’ జట్టులో విదిత్ గుజరాతి, పెంటేల హరికృష్ణ, అర్జున్ ఇరిగైశి, ఎస్ఎల్ నారాయణన్, శశికిరణ్, ‘బి’ జట్టులో నిహల్ సరీన్, గుకేశ్, అధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సద్వానీ ఉన్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తదితరులతో కూడిన ‘ఎ’ జట్టుకు టాప్ సీడింగ్ దక్కింది. ‘బి’ జట్టుకు 12వ సీడింగ్ లభించింది. ఈసారి చెస్ ఒలింపియాడ్లో రికార్డు స్థాయిలో 187 జట్లు పోటీపడుతున్నాయి. ఓపెన్ కేటగిరిలో అమెరికా టాప్ సీడ్గా, అజర్బైజాన్ రెండో సీడ్గా బరిలో దిగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
-
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
-
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
-
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
-
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్