అల్ఫియా, గీతికలకు స్వర్ణాలు

ఎల్డోరా బాక్సింగ్‌ కప్‌లో భారత బాక్సర్లు అల్ఫియా పఠాన్‌, గీతిక స్వర్ణాలతో మెరిశారు. 81 కేజీల ఫైనల్లో అల్ఫియా 5-0తో కంగిబయెవాను చిత్తు చేయగా.. 48 కేజీల తుది సమరంలో గీతిక 4-1తో సహచర బాక్సర్‌ కలైవాణిని ఓడించింది. 54 కేజీల విభాగంలో జమునకు నిరాశ ఎదురైంది.

Published : 05 Jul 2022 02:56 IST

దిల్లీ: ఎల్డోరా బాక్సింగ్‌ కప్‌లో భారత బాక్సర్లు అల్ఫియా పఠాన్‌, గీతిక స్వర్ణాలతో మెరిశారు. 81 కేజీల ఫైనల్లో అల్ఫియా 5-0తో కంగిబయెవాను చిత్తు చేయగా.. 48 కేజీల తుది సమరంలో గీతిక 4-1తో సహచర బాక్సర్‌ కలైవాణిని ఓడించింది. 54 కేజీల విభాగంలో జమునకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో ఆమె 0-5తో ఉక్సమోవా (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. ఈ టోర్నీని భారత్‌ 14 పతకాలతో (2 స్వర్ణ, 2 రజత, 10 కాంస్యాలు) ముగించింది. కుల్‌దీప్‌ కుమార్‌ (48 కేజీలు), అనంత చోప్డే (54 కేజీలు), సచిన్‌ (57 కేజీలు), జుగ్నూ (92 కేజీలు), జ్యోతి (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) సోనియా లాథర్‌ (57 కేజీలు), నీమా (63 కేజీలు), లలిత (70 కేజీలు), బబిత (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు