టీమ్ఇండియాకు 2 పాయింట్ల కోత
ఇంగ్లాండ్తో అయిదో టెస్టులో నెమ్మదిగా బౌలింగ్ చేసినందుకు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమ్ఇండియాకు రెండు పాయింట్ల కోత పడింది. దీంతో డబ్ల్యూటీసీలో భారత్ (75 పాయింట్లు; 52.08 పాయింట్ల శాతం) మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.
దుబాయ్: ఇంగ్లాండ్తో అయిదో టెస్టులో నెమ్మదిగా బౌలింగ్ చేసినందుకు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమ్ఇండియాకు రెండు పాయింట్ల కోత పడింది. దీంతో డబ్ల్యూటీసీలో భారత్ (75 పాయింట్లు; 52.08 పాయింట్ల శాతం) మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా (84; 77.78 శాతం), దక్షిణాఫ్రికా (60; 71.43 శాతం), పాకిస్థాన్ (44; 52.38 శాతం) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల శాతం ఆధారంగా జట్ల స్థానాలను నిర్ణయిస్తారు. ఐసీసీ నిబంధన ప్రకారం ఓ జట్టు నిర్ణీత సమయంలో ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే అన్ని పాయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడుతుంది. నాలుగో టెస్టులో రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు రిఫరీ.. భారత జట్టుకు 2 పాయింట్లు.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించాడు.
గాయత్రి జోడీ పరాజయం
కౌలాలంపుర్: మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి-ట్రెసా జాలీ జంట ఓడిపోయింది. మంగళవారం మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి-ట్రెసా 14-21, 14-21తో పియర్లె టాన్-టిన్యా (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్లో భారత్కు చెందిన మరో రెండు జోడీలు ఇంటిముఖం పట్టాయి. అశ్విని భట్-శిఖా గౌతమ్ 7-21, 10-21తో యుకి-సయాక (జపాన్) చేతిలో ఓడగా.. పూజ దండు-ఆర్తి సారా 17-21, 17-21తో గాబ్రియెలా స్టొయివా-స్టెఫానీ స్టొయివా (బల్గేరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్లో మాల్విక బన్సోద్ 10-21, 17-21తో గో జిన్ వీయ్ (మలేసియా) చేతిలో ఓడింది.
అమ్మాయిలు, అబ్బాయిలకు సమాన మ్యాచ్ ఫీజు
క్రైస్ట్చర్చ్: ప్రపంచ క్రికెట్లో తొలిసారిగా న్యూజిలాండ్లో పురుషులు, మహిళలు సమాన మ్యాచ్ ఫీజు అందుకోనున్నారు. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ఈ నిబంధన వర్తించేలా క్రీడాకారుల సంఘంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అయిదేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ‘‘పురుషులు, మహిళలకు సమానంగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని ఒప్పందం జరిగినందుకు క్రికెటర్లందరికి అభినందనలు. క్రికెట్లో ఇదో కీలక ఘట్టం. మహిళల క్రికెట్ ఎదుగుదల దిశగా పడిన మరో పెద్ద అడుగు’’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా