ప్రిక్వార్టర్స్‌లో సింధు

మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు శుభారంభం చేసింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఏడో సీడ్‌ సింధు 21-13, 17-21, 21-15తో హి

Published : 07 Jul 2022 03:53 IST

సాయి, ప్రణయ్‌, కశ్యప్‌ ముందంజ

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు శుభారంభం చేసింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఏడో సీడ్‌ సింధు 21-13, 17-21, 21-15తో హి బింగ్‌ జియావొ (చైనా)ను చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. గతనెల ఇండోనేసియా ఓపెన్‌ తొలి రౌండ్లో బింగ్‌ జియావొ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ 21-16, 17-21, 14-21తో కిమ్‌ యున్‌ (కొరియా) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయి ప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. తొలి రౌండ్లో సాయి ప్రణీత్‌ 21-8, 21-9తో కెవిన్‌ కార్డన్‌ (గ్వాటెమాలా)పై, కశ్యప్‌ 16-21, 21-16, 21-16తో టామి సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్‌ 21-19, 21-14తో బ్రైస్‌ లెవెర్‌దెజ్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ 19-21, 21-18, 16-21తో ఫెబ్రియానా- ఎమాలియా (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని