CWG 2022:సింగిల్స్లో పసిడి గెలుస్తా: సింధు
కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి రజతంతో సరిపెట్టుకుంది భారత్. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో సింధు సింగిల్స్లో విజయం సాధించినప్పటికీ.. మిగతా
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి రజతంతో సరిపెట్టుకుంది భారత్. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో సింధు సింగిల్స్లో విజయం సాధించినప్పటికీ.. మిగతా క్రీడాకారులు విఫలమవడంతో మలేసియా చేతిలో భారత్కు ఓటమి తప్పలేదు. అయితే ఇక్కడ స్వర్ణం చేజారినా.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలుస్తానని సింధు ధీమా వ్యక్తం చేసింది. ‘‘స్వర్ణం చేజారినందుకు కాస్త బాధగా ఉంది. కానీ మేం గట్టిగానే పోరాడాం. కొన్ని మ్యాచ్లు గెలుస్తాం, కొన్ని ఓడతాం. ఆటలో ఇవన్నీ సహజమే. మా ప్రత్యర్థి క్రీడాకారులు బాగా ఆడారు. నేను జట్టుకు ఒక పాయింట్ అందించా. దురదృష్టవశాత్తూ పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్లో విజయాలు సాధించలేకపోయాం. అయితే ఈ పోరు నుంచి సానుకూలతలు తీసుకుని సింగిల్స్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తాం. నేను స్వర్ణం గెలుస్తానని ఆశిస్తున్నా. కానీ అందులో తొలి రౌండ్ నుంచి ప్రతి మ్యాచ్ కీలకమే’’ అని సింధు పేర్కొంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో భారత్ 1-3తో ఓటమి పాలైంది. మొదట పురుషుల డబుల్స్లో సాత్విక్- చిరాగ్ జోడీ 18-21, 15-21తో ఫాంగ్- వూయి చేతిలో ఓడిపోయింది. ఈ స్థితిలో సింధు.. 22-20, 21-17తో జిన్ వీపై గెలిచి జట్టును రేసులో నిలిపింది. తర్వాత పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 21-6, 16-21తో జి యాంగ్ చేతిలో ఓటమి పాలవడంతో భారత్ మళ్లీ 1-2తో వెనుకబడింది. కీలక మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి గోపీచంద్-ట్రెసా జాలీ జోడీ 18-21, 17-21తో తిన్నయ-పియర్లీ జంట చేతిలో పరాజయం పాలవడంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్