CWG 2022: శ్రీజ-శరత్ జోడీకి స్వర్ణం
తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కామన్వెల్త్ క్రీడల్లో ఛాంపియన్ అయింది. సీనియర్ ఆటగాడు శరత్ కమల్తో కలిసి టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో ఆమె స్వర్ణం గెలిచింది.
తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కామన్వెల్త్ క్రీడల్లో ఛాంపియన్ అయింది. సీనియర్ ఆటగాడు శరత్ కమల్తో కలిసి టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో ఆమె స్వర్ణం గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో శ్రీజ-శరత్ జోడీ 11-4, 9-11, 11-5, 11-6తో చుంగ్-కరెన్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. శ్రీజ సింగిల్స్లో త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. కాంస్య పోరులో ఆమె 3-4తో యాంగ్ జి (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. టీటీ పురుషుల డబుల్స్లో శరత్కమల్-సత్యన్ రజతంతో సంతృప్తి పడ్డారు. ఫైనల్లో 2-3తో పాల్ డ్రింక్హల్-లిమ్ ఫిచ్ఫోర్డ్ (ఇంగ్లాండ్) చేతిలో ఓడారు. మరోవైపు సింగిల్స్లో శరత్కమల్ ఫైనల్కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శరత్ 4-2తో డ్రింక్హాల్ (ఇంగ్లాండ్)ను ఓడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్