Chess Olympaid: భారత్-2 మ్యాచ్ డ్రా
చెస్ ఒలింపియాడ్లో భారత్-2 జట్టు తొమ్మిదో రౌండ్లో అజర్బైజాన్ను 2-2తో నిలువరించింది. యువ సంచలనం గుకేశ్ విజయపరంపరకు అడ్డుకట్టపడింది.
మహాబలిపురం: చెస్ ఒలింపియాడ్లో భారత్-2 జట్టు తొమ్మిదో రౌండ్లో అజర్బైజాన్ను 2-2తో నిలువరించింది. యువ సంచలనం గుకేశ్ విజయపరంపరకు అడ్డుకట్టపడింది. తొలి ఎనిమిది గేముల్లో నెగ్గిన అతడు.. మమెద్యరోవ్తో గేమ్ను డ్రాగా ముగించాడు. మమెదోవ్ను నిహాల్ సరీన్ నిలువరించాడు. వసీఫ్పై ప్రజ్ఞానంద నెగ్గగా.. అబసోవ్ చేతిలో రౌనక్ ఓడిపోయాడు. భారత్-2 రెండో స్థానంలో కొనసాగుతోంది. హరికృష్ణ, విదిత్, అర్జున్, శశికిరణ్లతో కూడిన భారత్-1 జట్టు 3-1తో బ్రెజిల్పై నెగ్గింది. భారత్-3 జట్టు 3-1తో పరాగ్వే జట్టును ఓడించింది. మహిళల విభాగంలో టాప్ సీడ్ భారత్-1 జట్టు (హంపి, హారిక, వైశాలి, తానియా) 1.5-2.5తో పోలెండ్ చేతిలో ఓటమి చవిచూసింది. అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. భారత్-2 జట్టు 4-0తో స్విట్జర్లాండ్పై నెగ్గగా.. భారత్-3 జట్టు 3-1తో ఎస్తోనియాను ఓడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా