Chess Olympiad 2022: అగ్రస్థానంలో హంపి జట్టు
చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో భారత్-1 టైటిల్ రేసులో ముందుంది. కీలకమైన పదో రౌండ్లో 3.5-0.5తో కజకిస్థాన్ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. జన్సాయాపై హంపి, బలబయేవాపై తానియా, నక్బయేవాపై భక్తి నెగ్గగా.. అసౌబయేవాతో గేమ్ను వైశాలి డ్రాగా ముగించింది.
మహాబలిపురం: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో భారత్-1 టైటిల్ రేసులో ముందుంది. కీలకమైన పదో రౌండ్లో 3.5-0.5తో కజకిస్థాన్ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. జన్సాయాపై హంపి, బలబయేవాపై తానియా, నక్బయేవాపై భక్తి నెగ్గగా.. అసౌబయేవాతో గేమ్ను వైశాలి డ్రాగా ముగించింది. టోర్నీలో మరో రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. పోలెండ్ రెండో స్థానంలో ఉంది. భారత్-2 ఆరో స్థానంలో, భారత్-3 తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఓపెన్ విభాగం పదో రౌండ్లో ఉజ్బెకిస్థాన్తో మ్యాచ్ను 2-2తో డ్రాగా ముగించిన భారత్-2 రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది. గుకేశ్ టోర్నీలో తొలి ఓటమిని చవిచూశాడు. అబ్దుసత్తోరోవ్ చేతిలో అతడు ఓడిపోయాడు. సిందరోవ్పై ప్రజ్ఞానంద నెగ్గగా.. నిహాల్ సరీన్, అధిబన్ తమ గేమ్లను డ్రాగా ముగించారు. హరికృష్ణ, విదిత్, అర్జున్, నారాయణన్లతో కూడిన భారత్-1 జట్టు 2.5-1.5తో ఇరాన్పై గెలిచింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. భారత్-3 జట్టు 28వ స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM