ఫైనల్లో హలెప్
రెండుసార్లు ఛాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా) నేషనల్ బ్యాంక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో హలెప్ 2-6, 6-3, 6-4తో జెస్సికా (అమెరికా)పై విజయం సాధించింది.
టొరంటో: రెండుసార్లు ఛాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా) నేషనల్ బ్యాంక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో హలెప్ 2-6, 6-3, 6-4తో జెస్సికా (అమెరికా)పై విజయం సాధించింది. తొలి సెట్ చేజారినా.. పుంజుకున్న హలెప్ వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. టైటిల్ పోరులో బియాట్రిజ్ హడాడ్ (బ్రెజిల్)తో తలపడనుంది. 2016, 2018లో హలెప్ ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. మరోవైపు ప్రిక్వార్టర్స్లో టాప్సీడ్ స్వైటెక్ (పోలెండ్)కు షాకిచ్చిన బియాట్రిజ్ సెమీస్లో 6-4, 7-6 (9-7)తో పద్నాలుగో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. డబ్ల్యూటీఏ మాస్టర్స్ ఈవెంట్లో ఫైనల్ చేరడం బియాట్రిజ్కు ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు