ముంబయి ఖిలాడీస్‌ బోణీ

అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ ఆరంభ సీజన్‌లో ముంబయి ఖిలాడీస్‌ జట్టు బోణీ కొట్టింది. ఆదివారం గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో పరాజయంతో లీగ్‌ను మొదలెట్టిన ఆ జట్టు.. సోమవారం రాజస్థాన్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. ముంబయి 51-43 తేడాతో

Published : 16 Aug 2022 02:49 IST

పుణె: అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ ఆరంభ సీజన్‌లో ముంబయి ఖిలాడీస్‌ జట్టు బోణీ కొట్టింది. ఆదివారం గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో పరాజయంతో లీగ్‌ను మొదలెట్టిన ఆ జట్టు.. సోమవారం రాజస్థాన్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. ముంబయి 51-43 తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. మ్యాచ్‌లో గెలుపు కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ కీలక సమయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి జయభేరి మోగించింది. మరో మ్యాచ్‌లో ఒడిషా జగర్‌నట్స్‌ 51-43తో చెన్నై క్విక్‌ గన్స్‌పై గెలిచింది. ఒడిషా తరపున అటాకింగ్‌లో మహేష (6 పాయింట్లు), డిఫెన్స్‌లో దిలీప్‌ (ఒక్క నిమిషం ఒక్క సెకన్‌) రాణించారు. చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని