‘లక్ష్య’ అథ్లెట్లకు పతకాలు

జాతీయ ఓపెన్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం ‘లక్ష్య’ అథ్లెట్లు మూడు పతకాలు సాధించారు. మహిళల షాట్‌పుట్‌లో నీలం పల్లవి (అనంతపురం) రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల షాట్‌పుట్‌లో నీలం

Published : 20 Aug 2022 02:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ ఓపెన్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం ‘లక్ష్య’ అథ్లెట్లు మూడు పతకాలు సాధించారు. మహిళల షాట్‌పుట్‌లో నీలం పల్లవి (అనంతపురం) రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల షాట్‌పుట్‌లో నీలం సంజయ్‌రెడ్డి (అనంతపురం) కాంస్యం దక్కించుకున్నాడు. పురుషుల 400 మీటర్ల విభాగంలో ఎన్‌.రమణయ్య (శ్రీకాకుళం) రజత పతకం సొంతం చేసుకున్నాడు. పల్లవి, సంజయ్‌లకు కోచ్‌ సురేశ్‌, రమణయ్యకు కోచ్‌ రామారావు శిక్షణ ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని