Sachin Tendulkar: ఇండియన్ లెజెండ్స్కు సచిన్ కెప్టెన్సీ
రోడ్సేఫ్టీ ప్రపంచ సిరీస్ సీజన్-2 టోర్నమెంట్లో పాల్గొనే ఇండియన్ లెజెండ్స్ జట్టుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 10న ఆరంభమయ్యే
ముంబయి: రోడ్సేఫ్టీ ప్రపంచ సిరీస్ సీజన్-2 టోర్నమెంట్లో పాల్గొనే ఇండియన్ లెజెండ్స్ జట్టుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 10న ఆరంభమయ్యే ఈ టోర్నమెంట్కు కాన్పూర్, రాయ్పుర్, ఇండోర్, డెహ్రాడూన్ వేదికలుగా నిలువనున్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ కాన్పూర్లో జరుగుతుండగా.. రాయ్పుర్లో సెమీఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి. భారత్తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లకు చెందిన దిగ్గజ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. న్యూజిలాండ్ లెజెండ్స్ జట్టు ఈసారి కొత్తగా లీగ్లో చేరింది. రోడ్డు భద్రతే ప్రధాన ధ్యేయంగా ఈ సిరీస్ను నిర్వహిస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు ముందుకు వచ్చి ఇలా సిరీస్ ఆడడం వల్ల రోడ్డు భద్రతపై అభిమానుల్లో అవగాహన వస్తుందని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!