ఈసారి ఇంగ్లాండ్..
పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య ఏడు టీ20ల సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే.. రెండో మ్యాచ్లో భారీ విజయంతో పాకిస్థాన్ ఆధిపత్యాన్ని చాటింది. మూడో టీ20లో మళ్లీ పుంజుకున్న ఇంగ్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గింది.
కరాచి: పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య ఏడు టీ20ల సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే.. రెండో మ్యాచ్లో భారీ విజయంతో పాకిస్థాన్ ఆధిపత్యాన్ని చాటింది. మూడో టీ20లో మళ్లీ పుంజుకున్న ఇంగ్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గింది. శుక్రవారం మొదట బ్రూక్ (81 నాటౌట్; 35 బంతుల్లో 8×4, 5×6), డకెట్ (70 నాటౌట్; 42 బంతుల్లో 8×4, 1×6) చెలరేగడంతో ఇంగ్లాండ్ 3 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో టీ20లో 200 లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన పాక్.. ఈసారి తడబడి 158/8కు పరిమితం అయింది. బాబర్ (8), రిజ్వాన్ (8) ఆరంభంలోనే వెనుదిరగడంతో ఏ దశలోనూ పాక్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. షాన్ మసూద్ (66; 40 బంతుల్లో 3×4, 4×6) పోరాటం నిష్ఫలమైంది. వుడ్ (3/25), రషీద్ (2/32) ఆ జట్టును దెబ్బ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!